ఇస్లామాబాద్: పొరుగు దేశం పాకిస్థాన్కు చైనా నుంచి మరో 10 లక్షల డోసుల కొవిడ్-19 టీకాలు అందాయి. కరోనా కట్టడి కోసం చైనా తయారు చేసిన సినోఫార్మ్ వ్యాక్సిన్లను పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్లైన్స్ (పీఐఏ)కు చెందిన మూడు విమానాల్లో ఎయిర్లిఫ్ట్ చేశారు. ఈ నెల 29న అదనంగా మరో 20 లక్షల డోసులను చైనా నుంచి తరలించనున్నట్టు పీఐఏ కంట్రీ మేనేజర్ ఖదీర్ బక్ష్ సంగీ వెల్లడించారు.
పాకిస్తాన్లో కరోనా మహమ్మారి మూడో వేవ్ విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ వ్యాక్సిన్లను ఆగమేఘాల మీద తరలిస్తున్నారు. ఇప్పటివరకు పాకిస్తాన్లో 8 లక్షలకుపైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 17,100 మందికిపైగా కరోనా బాధితులు మరణించారు. కాగా, చైనా ఫిబ్రవరిలో తొలిసారి పాకిస్థాన్కు 5 లక్షల సినోఫామ్ వ్యాక్సిన్ డోసులను విరాళంగా ఇచ్చింది. మార్చిలో రెండో విడుతగా మరో 5 లక్షల డోసులు పంపింది. తాజాగా ఇప్పుడు మరో 10 లక్షల డోసులు చేరవేసింది.
కాగా, కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రస్తుతం పాకిస్థాన్లో పాక్షిక లాక్డౌన్ విధించి, వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగవంతం చేశారు. ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియలో అధికారులకు సహకారంగా ఆర్మీని సైతం రంగంలోకి దించారు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవికూడా చదవండి
14 రోజులు కొవిడ్ కర్ఫ్యూ.. ప్రజారవాణా బంద్..!
ప్రధాని నరేంద్ర మోదీకి జపాన్ ప్రధాని ఫోన్..!
రైల్లో వచ్చిన ఆక్సిజన్ ట్యాంకర్లు.. వీడియో
పోలింగ్ ఏజెంట్ టోపీపై మమతాబెనర్జి బొమ్మ..!
కరోనా ఎఫెక్ట్: శ్రీ హేమకుంద్ సాహిబ్ యాత్ర వాయిదా
ఒంట్లో వేడిని తగ్గించే ఈ చిట్కాలు మీకు తెలుసా..?
బెంగాల్లో ప్రశాంతంగా పోలింగ్..!