న్యూఢిల్లీ: ఇండియాలో కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా ఉన్న నేపథ్యంలో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పర్యటన రద్దయింది. ఈ నెల చివర్లో బోరిస్ జాన్సన్ ఇండియాకు రావాల్సి ఉంది. అయితే భారీగా కేసులు నమోదవుతున్న నేపథ్యంలో ఇప్పుడు పర్యటనను రద్దు వేశారు. రెండు దేశాల పరస్పర అంగీకారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. రెండు దేశాల మధ్య సంబంధాల విషయంపై చర్చించడానికి రానున్న రోజుల్లో వర్చువల్ సమావేశం నిర్వహించనున్నట్లు తెలిపింది.
నిజానికి గణతంత్ర వేడుకలకే బోరిస్ జాన్సన్ ముఖ్య అతిథిగా వస్తారని భారత ప్రభుత్వం చెప్పింది. అయితే ఆ సమయంలో బ్రిటన్లో కరోనా ఉధృతి ఎక్కువగా ఉన్నందున పర్యటన రద్దు చేసుకున్నారు. అప్పుడు రాలేకపోయినందుకు ఆయన ఏప్రిల్ చివరి వారంలో ఇండియా పర్యటనకు వస్తారని బ్రిటన్ ప్రకటించింది. కానీ ఇప్పుడు ఇక్కడ కేసులు ఎక్కువ అవుతుండటంతో మరోసారి ఆయన పర్యటన వాయిదా పడింది.
గుడ్న్యూస్.. నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ అభివృద్ధి చేసిన జుబిలంట్ ఫార్మా
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్ఖాన్తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ