న్యూఢిల్లీ: కరోనా కేసులు భారీగా పెరిగిపోతున్న నేపథ్యంలో రెమ్డెసివిర్ ఇంజెక్షన్కు ఏ స్థాయిలో డిమాండ్ ఉందో మనం చూస్తున్నాం. అయితే ఇప్పుడు నోటి ద్వారా ఇచ్చే రెమ్డెసివిర్ను అభివృద్ధి చేసినట్లు జుబిలంట్ ఫార్మా చెబుతోంది. దీనిని కొవిడ్ పేషెంట్లకు ఇవ్వడం సులువవుతుందని, ఇంజెక్షన్లకు ఏర్పడిన కొరతను ఇది తీరుస్తుందని జులిలంట్ చెబుతోంది.
ఇప్పటికే ఇది భద్రతకు సంబంధించిన పరీక్ష పాసవగా.. జంతువులు, మనుషుల శరీరాలు ఈ మందును బాగా శోషణ చేసుకున్నట్లు కూడా జుబిలంట్ సంస్థ వెల్లడించింది. దీనిపై అదనపు అధ్యయనాల కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) వీజీ సోమానీ అనుమతి కోరింది.
ఇది డీసీజీఐ అనుమతి పొందితే కొవిడ్ పేషెంట్లకు పెద్ద ఊరట లభించినట్లే. పేషెంట్లకు నోటి ద్వారా ఈ మందు ఇవ్వడం సులువు అవడంతోపాటు పెరిగిపోతున్న ఇంజెక్షన్ల డిమాండ్ను ఇది తీరుస్తుందని జుబిలంట్ చైర్మన్ శ్యామ్ భార్తియా, కో-చైర్మన్ హరి భార్తియా చెప్పారు. ఇంజెక్షన్ డోసేజ్లాగే ఓరల్ ట్రీట్మెంట్ కూడా ఐదు రోజుల పాటు ఉంటుందని తెలిపారు.
కొవిడ్ సోకి, ఆసుపత్రిలో చేరిన పేషెంట్లకు చికిత్సలో భాగంగా అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ అనుమతి పొందిన తొలి, ఏకైక యాంటీ-వైరల్ డ్రగ్ ఈ రెమ్డెసివిర్ మాత్రమే. జుబిలంట్తో పాటు మరో ఆరు ఫార్మా కంపెనీలు ఇండియాలో ఈ ఇంజెక్షన్ను తయారు చేస్తున్నారు. ఈ మధ్యే కేంద్రం ఆదేశాల మేరకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్ల ధరలను తగ్గించాయి. ప్రస్తుతం దీని ధర కంపెనీలను బట్టి రూ.899 నుంచి రూ.3490 వరకు ఉంది.
మీ హోదాకు ఇది తగదు.. మన్మోహన్కు హర్షవర్ధన్ కౌంటర్
IPL 2021: రషీద్ఖాన్తో కలిసి ఉపవాసం చేసిన వార్నర్, విలియమ్సన్
టార్గెట్ టీ20 వరల్డ్కప్.. రిటైర్మెంట్ నుంచి బయటకు వస్తానన్న ఏబీడీ
షాకింగ్.. కనీసం సగం మంది కరోనా యోధులకూ అందని వ్యాక్సిన్
కరోనా బారిన పడి కోలుకున్న వారికి ఒక్క డోసు వ్యాక్సిన్ చాలు!
ముత్తయ్య మురళీధరన్కు యాంజియోప్లాస్టీ
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు..!
దేశంలో కరోనా కరాళ నృత్యం.. 24 గంటల్లో భారీగా కొత్త కేసులు