Balochistan | బాంబు పేలుడు (blast)తో పొరుగు దేశం పాకిస్థాన్ (Pakistan) మరోసారి దద్ధరిల్లింది. బలూచిస్థాన్ (Balochistan)లోని క్వెట్టా రైల్వే స్టేషన్ (Quetta railway station)లో శనివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. స్టేషన్ నుంచి రైలు పెషావర్కు బయల్దేరుతుండగా.. ఈ పేలుడు సంభవించినట్లు పాకిస్థాన్ డాన్ న్యూస్ నివేదించింది. ఈ ఘటనలో 24 మంది మరణించగా.. సుమారు 30 మందికిపైగా గాయపడ్డారు.
ఈ పేలుడును ఆత్మాహుతి దాడిగా భావిస్తున్నట్లు క్వెట్టా సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ మహ్మద్ బలోచ్ తెలిపారు. ఘటన సమయంలో రైలు ప్లాట్ఫామ్పై వందలాది మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ క్రమంలో అక్కడ ఒక్కసారిగా పేలుడు సంభంవించింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు రైలు ప్లాట్ఫామ్పై ఉన్న సీసీటీవీ ఫుటేజ్లో రికార్డయ్యాయి. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. మరోవైపు ఈ ఘటనపై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు.
पाकिस्तान के क्वेटा रेलवे स्टेशन के पास बड़ा बम धमाका !!
इसमें बम धमाके मे 22 की मौत, 30 घायल।
ज्यादा खुजली हुई तो खुद पे ही बम मार लिया 💣 #QuetaBombBlast #Pakistan #Balochistan #TrainAccident pic.twitter.com/llL88PItEr
— Ansh (@realonlineansh) November 9, 2024
Also Read..
Samantha | అందుకే అలాంటి పాత్రలకు దూరంగా ఉంటా : సమంత
Sanjiv Khanna | మార్నింగ్ వాక్ అలవాటును వదులుకున్న తదుపరి సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా..!
Jharkhand | ఎన్నికల వేళ కీలక పరిణామం.. జార్ఖండ్ సీఎం పీఏ ఇంట్లో ఐటీ సోదాలు