Dengue | మన పొరుగు దేశమైన బంగ్లాదేశ్ (Bangladesh)లో డెంగ్యూ(Dengue) విధ్వంసం సృష్టిస్తోంది. ఎన్నడూ లేనివిధంగా డెంగ్యూ జ్వరం కారణంగా రికార్డు స్థాయిలో మరణాలు సంభవించాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ 1,000 మందికిపైగా ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. 2 లక్షల మందికిపైగా ఈ జ్వరం బారిన పడ్డారు.
ఈ విష జ్వరం కారణంగా ప్రజలు అధిక జ్వరం, తలనొప్పి, వికారం, వాంతులు, కండరాల నొప్పి వంటి కారణాలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. దీంతో ఆయా ఆసుపత్రులు రోగులతో రద్దీగా మారాయి. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకూ డెంగ్యూ కారణంగా 1,006 మంది ప్రాణాలు కోల్పోయినట్లు స్థానిక మీడియా వెల్లడించింది. దాదాపు 2 లక్షల మందికిపైగా ఈ వ్యాధి బారిన పడ్డారు. వీరిలో 2000 మంది రోగులు రెండోసారి డెంగ్యూ బారినపడ్డారు. ఇక మరణించిన వారిలో ఎక్కువ మంది 15 ఏళ్లలోపు వారే ఉండటం ఆందోళన కలిగిస్తోంది.
కాగా, జనసాంద్రత అధికంగా ఉన్న ఈ దక్షిణాసియా దేశంలో డెంగ్యూ వేగంగా విస్తరిస్తోంది. అధిక జ్వరం, తలనొప్పి, కండరాల నొప్పి, వికారం, వాంతులు, రక్తస్రావం వంటికి ఈ వ్యాధి లక్షణాలు. వాతావరణ మార్పుల వల్ల డెంగ్యూ, చికున్ గున్యా, ఎల్లో ఫీవర్, జికా వంటి దోమల కారణంగా వచ్చే వైరస్లు వేంగా వ్యాప్తి చెందుతాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. కాగా, డెంగ్యూ కారణంగా గతేడాది ఆ దేశంలో 281 మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే, ఈ ఏడాది అత్యధికంగా వెయ్యిమందికిపైగా మరణించడం అధికారులను ఆందోళనకు గురిచేస్తోంది.
Also Read..
Earthquake | ఉత్తరాదిని వణికించిన భారీ భూకంపం.. ఇళ్లనుంచి బయటకు పరుగులు తీసిన జనం
Nitin Gadkari | హైడ్రోజన్ బస్సులో టెస్ట్ డ్రైవ్కు వెళ్లిన నితిన్ గడ్కరీ.. వీడియో
Sanatana Dharma | సనాతన ధర్మం ఒక్కటే మతం.. మిగతావన్నీ వర్గాలు, పూజా విధానాలే : యోగి ఆదిత్యనాథ్