Jack Ma | అలీబాబా వ్యవస్థాపకుడు (Alibaba founder), చైనా కుబేరుడు జాక్ మా (Jack Ma) చాలా కాలం తర్వాత స్వదేశంలో అడుగుపెట్టారు. చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ (Xi Jinping) ఆగ్రహానికి గురై దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో గడిపిన ఆయన.. ఎట్టకేలకు చైనాలో ప్రత్యక్షమయ్యారు. ఈ విషయాన్ని సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ (South China Morning Post- SCMP) సోమవారం నివేదించింది. యాంట్ గ్రూప్ (Ant Group), అలీబాబ్ ఫౌండర్ (Alibaba founder) జాక్ మా (Jack Ma) మళ్లీ చైనాలో అడుగుపెట్టారని పేర్కొంది. అయితే, చైనాలో అడుగుపెట్టగానే హాంగ్జోయ్ (Hangzhou)లో తాను స్థాపించిన స్కూల్కే జాక్మా మొదటగా వెళ్లినట్లు మార్నింగ్ పోస్ట్ తెలిపింది. అక్కడ విద్యార్థులతో జాక్మా కాసేపు ముచ్చటించినట్లు పేర్కొంది. అనంతరం చైనా చేరుకున్నట్లు వెల్లడించింది.
అలీబాబా గ్రూప్ను స్థాపించి అపరకుబేరుడిగా ఎదిగిన జాక్మా.. 2020 చివరిలో అక్కడి ప్రభుత్వాన్ని బహిరంగంగా విమర్శించి చిక్కుల్లో పడ్డారు. ఓ పబ్లిక్ మీటింగ్లో మాట్లాడుతూ చైనా రెగ్యులేటరీ సిస్టంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చైనా అధికారులు జాక్మాకు చెందిన కంపెనీలపై వరుసగా దాడులు చేశాయి. ఆర్థిక పరంగా తీవ్ర ఇబ్బందులకు గురి చేశాయి. ప్రభుత్వ ఆగ్రహంతో అలీబాబా, యాంట్ గ్రూప్ తీవ్రంగా నష్టపోయాయి.
ఈ పరిణామాల నేపథ్యంలో 2021 చివర్లో ఆయన చైనాను వీడారు. ఆ తర్వాత జాక్ మా (Jack Ma) బయట ప్రపంచానికి కనిపించిన దాఖలాలు లేవు. జపాన్ (Japan), ఆస్ట్రేలియా (Australia), థాయ్లాండ్ (Thailand) దేశాల్లో జాక్ మా అప్పుడప్పుడు కనిపించారు. అందుకు సంబంధించిన ఫొటోలు అప్పట్లో వైరల్ అయ్యాయి. అలా దాదాపు ఏడాదిన్నరగా విదేశాల్లో ఉంటున్న జాక్మా తాజాగా చైనాలో అడుగుపెట్టారు. జాక్ మా రాకతో చైనా స్టాక్ మార్కెట్లో అలీబాబా షేర్లు ఒక్కసారిగా పుంజుకున్నాయి. కంపెనీ షేర్లు 4 శాతం కంటే ఎక్కువ పెరిగాయి.
Also Read..
Shikhar Dhawan | హెచ్ఐవీ టెస్ట్ చేయించుకున్నా : శిఖర్ ధావన్
viral Video | ఏఐని 59 ఏండ్ల కిందటే ఊహించిన ఫిక్షన్ రచయిత ఆర్ధర్ క్లార్క్