కాబూల్ : ఇటీవల తమపై జరిపిన వైమానిక దాడులకు ప్రతీకారంగా పాకిస్థాన్ సరిహద్దు పోస్ట్లపై సైనిక చర్యలను ప్రారంభించినట్టు ఆఫ్ఘనిస్థాన్లోని తాలిబన్ ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్థాన్ ఇస్లామిక్ ఎమిరేట్ అధికార ప్రతినిధి జబీహుల్లా ముజాహిద్ మాట్లాడుతూ పాకిస్థాన్ మిలిటరీ పదేపదే పాల్పడే కవ్వింపు చర్యలు, ఉల్లంఘనలకు సమాధానంగా వివాదాస్పద డ్యురాండ్ రేఖ వెంబడి పెద్దయెత్తున ప్రతీకార దాడులు ప్రారంభించామని చెప్పారు.
ఇప్పటికే అఫ్ఘాన్ యోధులు పలు పాకిస్థాన్ మిలిటరీ స్థావరాలను స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. తమ దాడిలో పలువురు పాక్ జవాన్లు మరణించారని, మరికొందరిని బంధించామని వెల్లడించారు.