Avalanche | కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదుకావడంతో ఇటీవల జమ్మూకశ్మీర్లోని ప్రముఖ హిల్స్టేషన్ సోనామార్గ్లో అవలాంచ్ (మంచు ఉప్పెన) ఏర్పడిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి మంచు ఉప్పెన టిబెట్లోని నైరుతి ప్రాంతాన్ని ముంచెత్తింది. అవలాంచ్ కారణంగా అక్కడ ఎనిమిది మంది మృత్యువాత పడినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
మెయిన్లింగ్ కౌంటీలోని పాయ్, మెడోగ్ కౌంటీలోని డోక్సాంగ్ ప్రాంతాల మధ్య మంగళవారం రాత్రి 8గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్థానిక మీడియా పేర్కొంది. ఈ మంచు ఉప్పెనలో ప్రజలు, వాహనాలు చిక్కుకుపోయినట్లు తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు పేర్కొంది. మంచు ఒక్కసారిగా ఉప్పెనలా రహదారిపైకి వచ్చినట్లు తెలిపింది. మంచు ఉప్పెనలో చిక్కుకుపోయిన వారి కోసం చైనా ప్రభుత్వం గాలింపు చర్యలు చేపట్టింది. ఈ మేరకు ఘటనాస్థలానికి 246 మంది సహాయక సిబ్బందిని పంపించినట్లు స్థానిక మీడియా వెల్లడించింది.
శీతాకాలంలో.. రికార్డు స్థాయిలో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతుంటాయి. అలాంటి సమయంలోనే అక్కడక్కడా అవలాంచ్లు ఏర్పడతాయి. భారీ ఎత్తున మంచు ఒక్కసారిగా విపరీతమైన వేగంతో కొండలపై నుంచి కిందకు రావడాన్ని అవలాంచ్ (మంచు తుపాను) అంటారు. దీనివల్ల ప్రాణ నష్టం ఎక్కువగా ఉంటుంది.