Sudan Crisis | సైన్యం, పారామిలిటరీ దళం (RSAF) మధ్య ఘర్షణతో ఆఫ్రికా దేశమైన సుడాన్ (Sudan) అట్టుడుకుతోంది. రెండు దళాలకు చెందిన అధిపతుల మధ్య విభేదాలతో (Rival generals) దేశం నరక కూపంగా మారిపోయింది. గత నాలుగు నెలలుగా జరుగుతున్న ఈ ఆధిపత్య పోరులో ప్రజలు పిట్టల్లా రాలిపోతున్నారు. తాజాగా ఆ దేశ రాజధాని ఖార్టూమ్ (Khartoum)లో ఆదివారం బహిరంగ మార్కెట్పై డ్రోన్ దాడి (Drone Attack) జరిగింది.
ఈ ఘటనలో కనీసం 43 మంది మృతిచెందినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు. దాదాపు 36 మందికి పైగా తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. ప్రస్తుతం గాయపడిన వారందరినీ సుడాన్లోని బషీర్ యూనివర్సిటీ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు చెప్పారు. అయితే, ఈ డ్రోన్ దాడి వెనుక ఎవరి హస్తం ఉందనే విషయంపై ఇంకా స్పష్టత రాలేదు.
సుడాన్పై పట్టుకోసం సైన్యం, పారామిలటరీ బలగాల మధ్య ఈ ఏడాది ఏప్రిల్ నెల నుంచి అంతర్యుద్ధం కొనసాగుతోంది. ఈ ఆధిపత్య పోరులో ఇప్పటి వరకూ 4,000 మందికి పైగా మరణించారు. అయితే వీరి సంఖ్య ఎక్కువగానే ఉంటుందని అంచనా. యునైటెడ్ నేషన్స్ శరణార్థ ఏజెన్సీ ప్రకారం ఈ ఘర్షణలతో తమ ప్రాంతాలనుంచి వలసోయిన వారి సంఖ్య 7.1 మిలియన్ల మందికి చేరుకోగా మరో 1.1 మిలియన్ల మంది పొరుగు దేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు.
Also Read..
Rishi Sunak | బంగ్లాదేశ్ ప్రధానితో రిషి సునాక్ హార్ట్ టచ్చింగ్ మూమెంట్.. ఫొటో వైరల్
Justin Trudeau | కెనడా ప్రధాని విమానంలో సాంకేతిక సమస్య.. రాత్రంతా ఢిల్లీలోనే బస చేసిన ట్రూడో