Turkey Earthquake: తుర్కియే-సిరియా సరిహద్దుల్లో ఇటీవల సంభవించిన భూకంపం పెను విషాదాన్ని మిగిల్చింది. ఈ నెల 7న తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం ధాటికి రెండు దేశాల్లో కలిపి వేల భవనాలు నేలమట్టమయ్యాయి. అంతా గాఢ నిద్రలో ఉన్న సమయంలో విపత్తు సంభవించడంతో నిద్రిస్తున్న వాళ్లు నిద్రిస్తున్నట్టే శిథిలాల కింద నలిగి శాశ్వత నిద్రలోకి వెళ్లిపోయారు.
అందుకే గత తొమ్మిది రోజులుగా శిథిలాలను తొలగించినా కొద్ది మృతదేహాలు వెలువడుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పటివరకు ఈ భూకంప మృతుల సంఖ్య 37 వేలు దాటింది. ఇంకా శిథిలాల తొలగింపు ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. కాబట్టి మరిన్ని మృతదేహాలు బయటపడుతాయి. దాంతో మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉన్నది.
ఇదిలావుంటే ఈ భారీ భూకంపం దెబ్బకు 2000 ఏళ్ల క్రితం నాటి కోట ధ్వంసమైంది. అప్పట్లో రోమన్ సామ్రాజ్యంలో భాగంగా ఉన్న తుర్కియేలోని గజియాన్టెప్ కోట ఇప్పటికే శిథిలావస్థలో ఉండేది. తాజా భూకంపం పుణ్యమా అని ఆ కోట దాదాపు పూర్తిగా ధ్వంసమైంది.
Gaziantep, Turkey | 2,000-year-old Gaziantep Castle from the Roman Empire lies damaged after consecutive devastating earthquakes that struck southern Turkey more than a week ago. pic.twitter.com/ldwY0FVGt3
— ANI (@ANI) February 14, 2023