Nigeria Boat Capsizes | దక్షిణ ఆఫ్రికాలోని నైజీరియా ( northern Nigeria)
దేశంలో ఘోర పడవ ప్రమాదం (Boat Capsizes) చోటు చేసుకుంది.పెళ్లి బృందంతో వెళ్తున్న పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో 103 మంది ప్రాణాలు కోల్పోయారు. స్థానిక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
క్వారా ( Kwara ) రాష్ట్ర రాజధాని ఇలోరిన్ కు 160 కిలోమీటర్ల దూరంలో ఉన్న పటేగి జిల్లాలో వివాహానికి హాజరైన ఓ పెళ్లి బృందం తిరుగు పయణమైంది. క్వారా రాష్ట్రంలోని నైజర్ నదిపై వస్తుండగా.. పరిమితికి మించి ప్రయాణికులు ఎక్కడంతో పడవ బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో చిన్నారులు సహా 103 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో వంద మందిని సురక్షితంగా రక్షించారు. ప్రమాద సమయంలో పడవలో సుమారు 300 మంది ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఘటనాస్థలి వద్ద సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు పేర్కొన్నారు.
Also Read..
Minister Harish Rao | ఆరోగ్య పరిరక్షణలో ఆదర్శ ప్రభుత్వం.. మంత్రి హరీశ్రావు ప్రత్యేక వ్యాసం
KTR | ఆడబిడ్డల సంక్షేమంలో ఎదురులేదు.. మహిళా సాధికారతలో తిరుగులేదు.. మంత్రి కేటీఆర్ ట్వీట్