జవహర్నగర్, ఫిబ్రవరి 24 : పరీక్షల్లో ఫెయిల్ అయ్యానని మనస్థాపానికి గురైన యువకుడు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జవహర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలో శుక్రవారం చోటుచేసుకున్నది. సీఐ సీతారాం తెలిపిన వివరాల ప్రకారం… జమ్మిగడ్డలోని మారుతీనగర్లో కైపా శ్రీనివాస్రెడ్డి, భార్య శిరీషారెడ్డి, కుమారుడు సాయిప్రణీత్రెడ్డితో కలిసి నివాసముంటున్నారు.
శ్రీనివాస్రెడ్డి ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తుండగా.. తల్లి శిరీషారెడ్డి ఏఎస్రావునగర్ డివిజన్ బీఆర్ఎస్ పార్టీ మహిళా అధ్యక్షురాలిగా కొనసాగుతుంది. ఇదిలా ఉండగా ప్రణీత్రెడ్డి ఇటీవల దూలపల్లిలోని మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీలో ఇంజినీరింగ్ పూర్తి చేశాడు. కానీ 10 వరకు బ్యాగ్లాగ్స్ మిగిలి ఉన్నాయి. దీంతో తీవ్ర మనస్థానికి గురైన సాయిప్రణీత్రెడ్డి ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.