హైదరాబాద్ : బీఆర్ఎస్ శ్రేణులు సైనికుల్లా పనిచేయడం వల్లే జూబ్లిహిల్స్ నియోజకవర్గంలో విజయం సాధించానని ఎమ్మెల్యే గోపీనాథ్ (Mla Gopinath) పేర్కొన్నారు. శుక్రవారం ఎర్రగడ్డ డివిజన్లో బీఆర్ఎస్ (BRS) ముఖ్య నాయకులు, బూత్ ఏజెంట్లు, రిలీవర్లు, మహిళా నాయకురాళ్ల సమావేశంలో మాట్లాడారు.
తనకు హ్యాట్రిక్ విజయాన్ని అందించటానికి సైనికుల్లా పని చేసిన పార్టీ నాయకులను శాలువాలతో సన్మానించారు. పదేళ్లలో ఎర్రగడ్డలో జరిగిన అభివృద్ధి, క్రమశిక్షణతో కూడిన కార్యకర్తల పని తీరుతన ఘన విజయానికి తోడ్పాటు అందించాయని పేర్కొన్నారు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో పార్టీ నాయకులు, కార్యకర్తలు జరిగిన అభివృద్ధిని, సంక్షేమాలను ఇంటింటికి చేరవేశారని అన్నారు.
పార్టీకి మూల స్తంభాలైన కార్యకర్తలను సత్కరించటం గర్వంగా ఉన్నదని పేర్కొన్నారు. బీఆర్ఎస్ శ్రేణులకు రుణపడి ఉంటానని వెల్లడించారు. కార్యక్రమంలో డివిజన్ అధ్యక్షుడు డి.సంజీవ, ప్రధాన కార్యదర్శి షరీఫ్ఖురేషీ, తన్నుఖాన్, గంట మల్లేష్, మహ్మద్సర్దార్, కృష్ణకుమార్, సలీంజావిద్, అజీమ్, మహ్మద్అహ్మద్, ముస్తాక్, కల్యాణి తదితరులు పాల్గొన్నారు.