వదంతులు నమ్మొద్దు.. ఓయూ అధ్యాపకుల హితవు
ఉస్మానియా యూనివర్సిటీ, మే 25 : ప్రభుత్వ ఉద్యోగం జీవితానికి భద్రత ఇస్తుందని,సమాజంలో గౌరవం పెంచుతుందని పలువురు అధ్యాపకులు అన్నారు. ఇష్టపడి కాదు..కష్టపడి చదివితే కొలువు సులువుగా సాధించొచ్చని సూచించారు. గ్రూప్-1, గ్రూప్ -2, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న నిరుద్యోగుల కోసం టీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో బుధవారం ఉస్మానియా యూనివర్సిటీ మెయిన్ లైబ్రరీ బిల్డింగ్లో సదస్సు జరిగింది. ముఖ్య అతిథులుగా ఆర్ట్స్ కళాశాల ప్రిన్సిపాల్ ప్రొ.గణేశ్, టీఆర్ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు తుంగ బాలు, వివిధ సబ్జెక్టుల నిపుణులు నాగార్జున, రఫీ,డాక్టర్ అలీ హాజరయ్యారు.
వారు మాట్లాడుతూ ప్రతి సబ్జెక్టును నిశితంగా చదవాలని, విషయ పరిజ్ఞానానికి సంబంధించిన పుస్తకాలను సమకూర్చుకోవాలన్నారు. నెగిటివ్ ఆలోచనలను దూరం చేసుకొని, పాజిటివ్ దృక్పథంతో ముందుకు సాగాలని సూచించారు. సదస్సు నిర్వాహకుడు,టీఆర్ఎస్వీ నాయకుడు పి.రమేశ్ముదిరాజ్, హరిబాబు, శశిపాల్, రాజేశ్నాయక్, శివ, నాగరాజు, సందీప్ తదితరులు పాల్గొన్నారు.