హైదరాబాద్: నగర శివార్లలోని కొంపల్లిలో రోడ్డు ప్రమాదం జరిగింది. గురువారం ఉదయం కొంపల్లిలో ఓ మహిళ రోడ్డు దాటుతున్నది. అదే సమయంలో అటువైపుగా వస్తున్న బొలెరో జీపు టైరు పేలింది. దీంతో అదుపు తప్పిన బొలెరో ఆ మహిళను ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం దవాఖానకు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి వివరాలు తెలియాల్సి ఉన్నది.