Hyderabad | హైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. . బంజారాహిల్స్లోని ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రి వద్ద రోడ్డు దాటుతున్న ఓ మహిళను వేగంగా వచ్చిన బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతిచెందింది. మృతురాలిని పార్క్ హయత్లో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్న శశికళగా గుర్తించారు. మరోవైపు పెద్దపల్లి జిల్లా మంథని మండలం లక్కేపూర్ క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఇద్దరు సోదరులు దుర్మరణం చెందారు. మృతులను తాటి నాగరాజు గౌడ్, నవీన్గౌడ్గా గుర్తించారు.
ఎల్బీనగర్లో కారు బీభత్సం
ఎల్బీనగర్లో శనివారం అర్ధరాత్రి ఓ కారు బీభత్సం సృష్టించింది. అతివేగంతో వచ్చిన ఓ కారు మరో కారును ఢీకొట్టింది. ఈ ఘటనలో ఒకరు మరణించగా.. ముగ్గురు గాయపడ్డారు. సందీప్ అనే వ్యక్తి కారు నడిపించినట్లుగా పోలీసులు గుర్తించారు.