బొల్లారం : ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కృషి చేస్తానని కంటోన్మెంట్ ఎమ్మెల్యే జి.సాయన్న అన్నారు. బుధవారం కంటోన్మెంట్ ఏడో వార్డు ఎల్ ఐసీ (జేఎన్ ఎన్ యూఆర్ ఎమ్ ) కాలనీలో స్థానికులతో కలిసి పర్యటించి సమస్యలు తెలుసుకున్నారు.కొంత కాలంగా తాగునీటి సరఫరా లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నామని బస్తీవాసులు ఎమ్మెల్యే ఎదుట వాపోయారు.
సానూకూలంగా స్పందించిన ఎమ్మెల్యే సాయన్న కంటోన్మెంట్ బోర్డు అధికారులతో మాట్లాడి త్వరితగతిన కాలనీలో త్రాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలని బోర్డు నీటి విభాగం అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో బోయిన్ పల్లి మార్కెట్ మాజీ చైర్మన్ టీఎన్ శ్రీనివాస్, వార్డు అధ్యక్షుడు తేజ్ పాల్ , మహిళ అధ్యక్షురాలు నాగినేణి సరిత, మాజీ బోర్డు సభ్యుడు పాండు యాదవ్ , టీఆర్ఎస్ నాయకులు ముప్పిడి మధుకర్ , నాగేందర్ , కురుమయ్య, సదానంద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.