మన్సూరాబాద్, ఏప్రిల్ 30 : కాంగ్రెస్ పార్టీ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజా సమస్యలను గాలికి వదిలేసిందని ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డికి మద్దతుగా మంగళవారం మన్సూరాబాద్ డివిజన్ పరిధి ఎంఈరెడ్డి గార్డెన్లో ప్రజా సమస్యల పరిష్కార సమితి అధ్యక్షుడు గోపాల్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి, మల్కాజిగిరి పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరై ప్రసంగించారు. మల్కాజిగిరి పార్లమెంటులో ఓటు హక్కులేని కాంగ్రెస్, బీజేపీ అభ్యర్థులకు ఓటు వేస్తే లాభం లేదన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ కొప్పుల విఠల్రెడ్డి, డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు జక్కిడి మల్లారెడ్డి, మాజీ అధ్యక్షులు కొసనం వెంకట్రెడ్డి, పోచబోయిన జగదీశ్ యాదవ్, నాయకులు నర్రి వెంకన్నకురుమ, ఏలుకొండ రాంకోటి, కేకేఎల్ గౌడ్, సుధాకర్నాయి, సూరజ్ యజ్దాని తదితరులు పాల్గొన్నారు.