Minister Ponnam Prabhakar | ఆర్టీసీ భూముల్లో ఇందిరమ్మ ఇండ్లు కడితే తప్పేంటి..? మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. మీడియా సమావేశంలో ఆర్టీసీ స్థలాల విషయంలో గందరగోళం ఉంది.. విభజన చట్టాన్ని వ్యతిరేకించి ఇందిరమ్మ ఇండ్లకు ఇస్తున్నారని ఓ రిపోర్టర్ మంత్రి పొన్నంను ప్రశ్నించాడు. దీనికి మంత్రి పొన్నం స్పందిస్తూ.. తెలంగాణలో ఉండి విభజన చట్టం ఇంకేముంది.. ఆర్టీసీ వందల ఎకరాలు తీసుకుంటున్నపుడు ప్రభుత్వం అడిగితే 5-10 ఎకరాలు ఇవ్వొద్దా..? అందులో తప్పేముందన్నారు.
మేం ప్రభుత్వం తరపున కొత్త టర్మినల్స్ కోసమో లేదంటే అనేక సందర్భాల్లో తీసుకుంటున్నం. ఇవన్నీ స్థలాలు ప్రభుత్వాలవే.. ఆర్టీసీ వేరే కాదు..? ఆర్టీసీ కూడా ప్రభుత్వమేనన్నారు. మేం గతంలో ఉపాధి ఒక దగ్గర, ఇల్లు ఒక దగ్గర వాడు పోతలేడని చెప్పి ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గానికి రివ్యూ పెట్టుకొని తీసుకున్నం. దాంట్లో ఎక్కడా పొరపాటు లేదు.. ఆర్టీసీ తరపున మేం వందల ఎకరాలు ప్రభుత్వం తరపున తీసుకుంటున్నం. అందుకు సంబంధించి ఎలాంటి సమస్య లేని స్థలాన్ని ఇస్తున్నం.
అది కూడా పేదల ఇండ్లకు దీని మీద ఏమన్నా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే మార్చుకోవాలని కోరుతున్నానన్నారు. ఎందుకంటే కొంతమంది దాని మీద ఊరికే రాద్దాంతం చేసే ప్రయత్నం చేస్తున్నరు. వాళ్లు ఆంధ్రాకు బెనిఫిట్ చేయాలని చూస్తున్నరా..? ఏమో తెలియదు.. కానీ ఏం పేదలు ఇల్లు కట్టుకుంటే తప్పేముందంటూ చెప్పుకొచ్చారు.
Tirumala | సెప్టెంబర్ నెలలో తిరుమలలో విశేష పర్వదినాలు ఇవే..15 నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
New York: న్యూయార్క్ టైమ్స్ స్క్వేర్లో కత్తులతో మహిళ దాడి.. వీడియో
Biceps | పెద్ద బైసెప్స్ కావాలంటే పాటించాల్సిన చిట్కాలు ఇవే.. ఇలా చేయండి..