Russia : రష్యా-ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం కొనసాగుతోంది. ఇరు దేశాలు పరస్పరం దాడులు చేసుకుంటున్నాయి. తాజాగా ఉక్రెయిన్పై రష్యా భారీ దాడికి దిగింది. రాజధాని కీవ్తోపాటు ఒడెశాపై డ్రోన్లు, మిస్సైళ్లతో విరుచుకుపడింది. ఈ ఘటనలో 12 మంది మరణించినట్లు సమాచారం. మృతుల్లో ఒక భారతీయుడు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. అతడికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా దాడులపై ఉక్రెయిన్ ప్రకటన చేసింది. దీని ప్రకారం.. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు ఉక్రెయిన్లోని 28 స్థావరాలపై రష్యా దాడి చేసింది. 200 వరకు డ్రోన్లు, మిస్సైళ్లతో దాడి చేసింది. కీవ్తోపాటు ఒడెశా ప్రాంతంపై బాలిస్టిక్ మిస్సైల్స్, క్రూయిజ్ మిస్సైల్స్, యాంటీ రాడార్ మిస్సైళ్లతో దాడికి పాల్పడింది. ఈ దాడుల కారణంగా ఉక్రెయిన్లో 12 మంది మరణించారు. మరికొందరు గాయపడ్డారు. క్షతగాత్రుల్లో పిల్లలు కూడా ఉన్నారు. జనావాసాలపై ఈ దాడులు జరిగాయి. అనేక ఇండ్లు, అపార్ట్మెంట్లు ధ్వంసమయ్యాయి.
దాడి అనంతరం ధ్వంసమైన నివాసాల నుంచి అధికారులు ప్రజల్ని ఖాళీ చేయిస్తున్నారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. భారీ స్థాయిలో సిబ్బంది సహాయక చర్యల్లో పాల్గొంటున్నారు. ఈ దాడుల కారణంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. మరోవైపు ప్రస్తుత పరిస్థితుల్లో ఉక్రెయిన్కు సాయం అందించేందుకు యురోపియన్ యూనియన్ సిద్ధమైంది. ఆర్థిక సాయంతోపాటు 104 బిలియన్ డాలర్ల అప్పు ఇచ్చేందుకు కూడా ఈయూ ప్రయత్నిస్తోంది.