బంజారాహిల్స్,సెప్టెంబర్ 1: పేద ప్రజల సంక్షేమమే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయంగా పనిచేస్తున్నదని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు. అనారోగ్యంతో బాధపడుతున్న వ్యక్తుల చికిత్స కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కింద మంజూరయిన చెక్కులను బుధవారం ఎమ్మెల్యే దానం లబ్ధిదారులకు అందజేశారు. ప్రేమ్నగర్ బస్తీకి చెందిన కన్నయ్య సింగ్కు రూ.56వేలు, ఇందిరానగర్కు చెందిన రవికుమార్కు రూ.60వేలు,నందినగర్కు చెందిన సాయిరామ్కు రూ.60వేలు, వినాయక్నగర్కు చెందిన ఎల్లమ్మకు రూ.60వేలు, బీజేఆర్నగర్కు చెందిన తులసికి రూ.28,500 మంజూరయ్యాయని ఎమ్మెల్యే దానం తెలిపారు.
పేదలకు ఏ కష్టమొచ్చినా ప్రభుత్వం సాయమందిస్తోందని, కల్యాణలక్ష్మి, షాదీముబారక్, ఆసరా పింఛన్లు తదితర పథకాలతో పేదలకు ప్రయోజనం కలుగుతోందన్నారు. కార్యక్రమంలో వివిధ డివిజన్లకు చెందిన టీఆర్ఎస్ నాయకులు అశోక్, ఆంథోనీ, ఒర్సు శ్రీను, టి.రాములు, ఎస్ఎమ్.జావిద్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వినాయక్నగర్ బస్తీలో మురుగు సమస్యలు పరిష్కరించాలని స్థానిక టీఆర్ఎస్ నేత ఒర్సు శ్రీను తదితరులు ఎమ్మెల్యే దానం నాగేందర్కు వినతిపత్రం అందజేశారు. త్వరలోనే సమస్యలను పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు.