సికింద్రాబాద్ : రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని కంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న చెప్పారు. సర్కారు ప్రవేశపెట్టిన కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్ పథకాలు నిరుపేదలకు కొండంత అండగా నిలుస్తున్నాయని గుర్తు చేశారు.
మంగళవారం మడ్ఫోర్డ్ ప్రభుత్వ పాఠశాల వద్ద కంటోన్మెంట్లోని తిరుమలగిరి మండలానికి చెందిన 68 కల్యాణ లక్ష్మి లబ్ధిదారులకు సుమారు రూ.68లక్షల 7,888 విలువైన చెక్కులను కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డితో కలిసి ఎమ్మెల్యే సాయన్న పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే సాయన్న మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేని విధంగా పేదలు వివాహాలు చేస్తే అప్పులు చేయకూడదనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ పథకాన్ని తీసుకొచ్చారన్నారు. ఈ పథకం నిరుపేదల ఆడపిల్లల తల్లిదండ్రులకు ఎంతో మనోధైర్యాన్ని ఇస్తుందన్నారు.
కార్యక్రమంలో తిరుమలగిరి మండల తాసీల్దార్ మాధవిరెడ్డి, ఆర్ఐ ఫ్రాన్సిస్, బోర్డు మాజీ సభ్యులు ప్రభాకర్, పాండుయాదవ్, నళినికిరణ్, లోక్నాథ్లతో పాటు నేతలు నివేదితా, ముప్పిడి గోపాల్, టీఎన్ శ్రీనివాస్, పిట్ల నగేష్, దేవులపల్లి శ్రీనివాస్, సరిత, అందె శ్రీను, ధీననాథ్ యాదవ్తో పాటు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.