చార్మినార్, మే 24 : రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతున్న రేషన్ డీలర్ల సమస్యలను పరిష్కరించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదని పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్ స్పష్టం చేశారని రేషన్ డీలర్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాయకోటి రాజు, ఉపాధ్యక్షుడు పుస్తె శ్రీకాంత్ తెలిపారు. బుధవారం రేషన్ డీలర్ల సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర మంత్రి గంగుల కమలాకర్ను కలిసి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం పురాణాపూల్లో రాష్ట్ర రేషన్ డీలర్ల సంఘం ఉపాధ్యక్షుడు పుస్తె శ్రీకాంత్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రేషన్ డీలర్లు ఎదుర్కొంటున్న 22 ప్రధాన సమస్యలను పరిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లినట్లు తెలిపారు. డీలర్లు ఎదుర్కొంటున్న 22 సమస్యల్లో 20సమస్యలను పరిష్కరించడానికి సిద్ధంగా ఉన్నామని మంత్రి తెలిపారు. మంత్రిని కలిసిన వారిలో నగర రేషన్ డీలర్ల సంఘం ప్రతినిధులు శ్రీధర్ వల్లాల, మురళీ, తదితరులు పాల్గొన్నారు.