పూడూరు, జనవరి 17 : పండుగ రోజు కోట్పల్లి ప్రాజెక్టుకు కుటుంబ సమేతంగా విహారయాత్ర కోసం వెళ్లి ఈత కొడుతూ ప్రమాదవశాత్తు సోమవారం యువకులు లోకేశ్, వెంకటేశ్, జగదీశ్, రాజేశ్ ప్రాజెక్టులో మునిగి మృతిచెందిన విషయం తెలిసిందే. ఈ ఘటన తెలుసుకున్న మంత్రి సబితారెడ్డి, ఎంపీ రంజిత్రెడ్డి, ఎమ్మెల్సీ మహేందర్రెడ్డి, ఎమ్మెల్యేలు మహేశ్రెడ్డి, నరేందర్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రామోహన్రెడ్డి, మాజీ ఎంపీ విశ్వేశ్వర్రెడ్డి వేర్వేరుగా మృతుల స్వగ్రామం మన్నెగూడలోని వారి కుటుంబసభ్యులను మంగళవారం పరామర్శించి ఓదార్చి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా మంత్రి సబితారెడ్డి మాట్లాడుతూ.. జరిగిన సంఘటన దురదృష్టకరమని, బాధిత కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని తెలిపారు. అర్హతను బట్టి కుటుంబంలో ఒకరికి అవుట్ సోర్సింగ్లో ఉద్యోగ అవకాశంతోపాటు డబుల్ బెడ్రూం ఇల్లు మంజూరు చేయిస్తామని తెలిపారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి అవకాశమున్నా కుటుంబానికి అందేలా చూస్తామని ఎంపీ రంజిత్రెడ్డి, ఎమెల్యే మహేశ్రెడ్డి పేర్కొన్నారు. సొసైటీలో ఉద్యోగ అవకాశం కల్పిస్తామని డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి కుటుంబసభ్యులకు హామీ ఇచ్చారు.
స్వచ్ఛందంగా ఎమ్మెల్యే మహేశ్రెడ్డి రూ.లక్ష, ఎంపీ రంజిత్రెడ్డి రూ.లక్ష, ప్రభుత్వం నుంచి రూ.40వేలు కలిపి మంత్రి సబితారెడ్డి బాధితులకు ఆర్థిక సాయం అందజేశారు. డీసీసీబీ చైర్మన్ మనోహర్రెడ్డి రూ.లక్ష, మాజీ ఎమ్మెల్యే రామ్మోహన్రెడ్డి రూ.లక్ష చొప్పున వేర్వేరుగా బాధిత కుటుంబ సభ్యులకు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ మల్లేశం, జడ్పీటీసీ మేఘమాల, సర్పంచ్ వినోద్గౌడ్, సొసైటీ మండల చైర్మన్ సతీష్రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజారుద్దీన్, ఆయా పార్టీల అధ్యక్షులు మహిపాల్రెడ్డి, సురేందర్, అనిల్, అదిల్, అనంత్రెడ్డి, సత్యనారాయణరెడ్డి, సదానందరెడ్డి, మల్లేశం, ఆర్డీవో విజయకుమారి, తహసీల్దార్ కిరణ్ ఉన్నారు.