Drinking Water | సిటీ బ్యూరో, ఫిబ్రవరి 13 (నమస్తే తెలంగాణ): నీటి మరమ్మతు పనుల వల్ల వచ్చే సోమవారం, మంగళవారం నగరంలోని పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరా ఆగిపోనుంది. గ్రేటర్ హైదరాబాద్కు తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై ఫేజ్-1లోని కొండపాక పంపింగ్ స్టేషన్ వద్ద 3000 ఎంఎం డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్కు 900 ఎంఎం డయా వాల్వులు అమర్చనున్నారు. ఈ పనులు ఫిబ్రవరి 16,17 తేదీల్లో సోమవారం ఉదయం 6 గంటల నుంచి మంగళవారం ఉదయం 6 గంటల వరకు కొనసాగుతాయి. ఈ 24 గంటల పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుంది.
ఎస్సార్ నగర్, సనత్ నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగళ్రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్, కూకట్పల్లి, భాగ్యనగర్, వివేకానంద నగర్, ఎల్లమ్మ బండ, మూసాపేట, భరత్ నగర్, మోతీ నగర్, గాయత్రి నగర్, బాబా నగర్, కేపీహెచ్బీ, బాలాజీ నగర్, హస్మత్ నగర్, చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్ నగర్, గాజుల రామారం, సూరారం, ఆదర్శ్ నగర్, భగత్ సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ, అల్వాల్, ఫాదర్ బాలయ్య నగర్, వెంకటాపురం, మచ్చ బొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్పేయ్ నగర్, యాప్రాల్, చాణిక్యపురి, గౌతమ్ నగర్, సాయినాథపురం, చర్లపల్లి, సాయిబాబా నగర్, రాధికా, కొండాపూర్, డోయెన్స్, మాదాపూర్ (కొన్ని ప్రాంతాలు), హఫీజ్పేట, మియాపూర్, కొంపల్లి, గుండ్ల పోచంపల్లి, తూంకుంట, జవహర్ నగర్, దమ్మాయిగూడ, నాగారం, నిజాంపేట, బాచుపల్లి, ప్రగతి నగర్, గండి మైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం, ఎంఈఎస్, త్రిశూల్ లైన్స్, గన్రాక్, హకీంపేట ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, బీబీ నగర్ ఎయిమ్స్, ప్రజ్ఞాపూర్ (గజ్వేల్), ఆలేరు (భువనగిరి), ఘన్పూర్ (మేడ్చల్) ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం కలగనుందని అధికారులు తెలిపారు. నీటిని పొదుపుగా వాడుకోవాలని సూచించారు.