సిటీబ్యూరో, మార్చి 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు ప్రాజెక్టులో సింగపూర్ నుంచి ఖానాపూర్ వరకు ఉన్న 1200 ఎంఎం డయా పీఎస్సీ గ్రావిటీ మెయిన్ పైపులైన్లోని 350 ఎంఎం డయా స్లూయిస్ వాల్వ్కు మరమ్మతులు చేపట్టాల్సి ఉండటంతో బుధవారం ఉదయం 6 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుందని అధికారులు తెలిపారు. షేక్పేట్, టోలిచౌకి, గోల్కొండ, బోజగుట్ట, గండిపేట్, కోకాపేట్, నార్సింగి, పుప్పాల గూడ, మణికొండ, ఖానాపూర్, నెక్సంపూర్, మంచిరేవుల ప్రాంతాల్లో నీటి సరఫరా ఉండదన్నారు.