సిటీబ్యూరో, మే 3 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ మహానగరంలో పరిపాలనను పౌరులకు మరింత చేరువ చేయాలన్న ఉద్దేశంతో వార్డు పాలన వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నారు. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో 150 వార్డు ఆఫీసులను నెలాఖరులోగా ఏర్పాటు చేయనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో బుధవారం మంత్రి కే. తారకరామారావు పురపాలక శాఖపై నిర్వహించిన సమీక్షలో ఈ విషయాన్ని వెల్లడించారు. అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉన్న ఈ వార్డు కార్యాలయాల్లో వివిధ విభాగాలకు చెందిన సుమారు 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉంటారు. వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతో పాటు ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిషారానికి వేగంగా పనిచేస్తారు.
జీహెచ్ఎంసీ పరిధిలో ఉన్న 150 వార్డుల్లో ఈ వార్డు ఆఫీసులను ఏర్పాటు చేయనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేయనున్న ఈ వార్డు ఆఫీసుల్లో సుమారు పది మంది క్షేత్రస్థాయిలో అధికారులు అందుబాటులో ఉంటారని మంత్రి వెల్లడించారు. వార్డు పరిపాలనా వ్యవస్థకు అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ స్థాయి అధికారి ఇన్చార్జిగా ఉంటారని పేర్కొన్నారు. ఈ అధికారికి అనుబంధంగా పారిశుద్ధ్యం, విద్యుత్ సరఫరా, రోడ్ల నిర్వహణ, ఎంటమాలజీ విభాగం, వెటర్నరీ విభాగం, టౌన్ ప్లానింగ్ విభాగం, జలమండలి వంటి తదితర కీలకమైన విభాగాలకు సంబంధించిన సూమారు 8 నుంచి 10 మంది అధికారులు క్షేత్రస్థాయిలో పనిచేస్తారని చెప్పారు.
వీరు ఎప్పటికప్పుడు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాల అమలు తీరుతో పాటు ప్రజల ఫిర్యాదులను స్వీకరించి, వాటి పరిషారానికి వేగంగా పనిచేస్తారని తెలిపారు. బుధవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నూతన సచివాలయంలో మంత్రి కేటీఆర్ పురపాలక శాఖపైన విసృ్తత స్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. హైదరాబాద్ నగరంలో వార్డు పాలనా వ్యవస్థను తీసుకువచ్చేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రణాళికలపై పురపాలక శాఖ ఉన్నతాధికారుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అధికారులకు వార్డు పాలనా వ్యవస్థకు సంబంధించి ప్రభుత్వ ఆలోచన విధానాన్ని, లక్ష్యాలను వివరించారు.
పాలనలో పౌరుల భాగసామ్యం పెంచడమే లక్ష్యం
నూతనంగా ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే వార్డు పాలనా వ్యవస్థ ద్వారా ప్రజలు ప్రస్తుతం సరిల్ కార్యాలయాలకు, జోనల్ ఆఫీసులకు వెళ్లకుండా తమకు అత్యంత చేరువుగా ఉండే వార్డు పరిధిలోనే, తమ ఫిర్యాదులను, ప్రభుత్వానికి అవసరమైన సలహాలు సూచనలు అందించేందుకు వీలు కలుగుతుందని పేర్కొన్నారు. దీంతో వేగంగా ప్రభుత్వానికి ప్రజల సమస్యలను తెలుసుకునే అవకాశం రావడంతో పాటు వాటిని పరిషరించేందుకు వీలు కలుగుతుందన్నారు.
ప్రజలందరికీ పరిపాలన ఫలాలు అందాలి
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రజలకు పరిపాలనా ఫలాలు అందించాలన్న ఒక ఉన్నత లక్ష్యంతో ఏర్పాటయిందని, ఈ దిశగా సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో పరిపాలనను వికేంద్రీకరించి నూతనంగా జిల్లాలను, రెవెన్యూ డివిజన్లను, మండలాలను, ఏర్పాటు చేశారని పేర్కొన్నారు. దీంతో పాటు నూతన మున్సిపాలిటీలు, గ్రామపంచాయతీలను కూడా ఏర్పాటుచేసి ప్రజల ఇంటి ముందుకే ప్రభుత్వ ఫలాలను తీసుకువెళ్లే ప్రయత్నంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. ఈ దిశగా సీఎం కేసీఆర్ ఆలోచన విధానాన్ని ముందుకు తీసుకువెళ్లే ఉద్దేశంతో హైదరాబాద్ నగరంలోనూ పరిపాలనను మరింతగా పౌరులకు చేరువ చేయాలనే లక్ష్యంతో వార్డు పాలనా వ్యవస్థకు శ్రీకారం చుట్టబోతున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
ఈ నెలాఖరు నాటికి వార్డు పాలన వ్యవస్థ సిద్ధం
ప్రభుత్వం ఏర్పాటు చేయాలని అనుకుంటున్న ఈ వార్డు పాలనా వ్యవస్థకు సంబంధించిన పనులు ఈ నెలాఖరు నాటికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రానున్న ఒకటి, రెండు వారాల్లో వార్డు కార్యాలయాల్లో ఉంచాల్సిన సిబ్బందితో కూడిన బృందాలను సిద్ధం చేయాలని మంత్రి కేటీఆర్ సూచించారు. ఈ మొత్తం బృందాలను ఈ రెండో వారంలోగా సిద్ధం చేసి, వారికి వార్డు పాలనా వ్యవస్థ ఉద్దేశాలు, లక్ష్యాలను, అది పనిచేసే తీరుకు సంబంధించిన అంశాల్లో పకా ప్రణాళికతో కూడిన శిక్షణ ఇవ్వాలని మంత్రి సూచించారు. ఈ వార్డు కార్యాలయాలను ఏకరూపంగా ఉండేటట్లు, ఒక సిటిజన్ ఫ్రెండ్లీ డిజైన్ ను కార్యాలయాల కోసం రూపొందించాలని సూచించారు. వార్డు కార్యాలయాలను సామాజిక మాధ్యమాలతో పాటు, ప్రతి వార్డు కార్యాలయం ఇంకో వార్డు కార్యాలయంతో అనుసంధానం అయ్యేలా అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించుకోవాలన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న ఈ వార్డు పాలనా వ్యవస్థతో ప్రజలకు పౌర సేవలు వేగంగా అందుతాయన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ సమీక్షా సమావేశంలో పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్ కూమార్, జలమండలి ఎండీ దాన కిశోర్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు.