సిటీబ్యూరో, నవంబర్ 16 (నమస్తే తెలంగాణ) : స్పెషల్ సమ్మర్ రివిజన్ (ఎస్ఎస్ఆర్) 2023 ప్రకారంగా ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేసిన నేపథ్యంలో జాబితాను పరిశీలన చేసుకొని పేరు లేని పక్షంలో తిరిగి ఓటరు నమోదు చేసుకోవచ్చని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ తెలిపారు.
జనవరి 1, 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారంతా తప్పనిసరిగా ఓటరుగా నమోదు చేసుకోవాలన్నారు. ముసాయిదా ఓటరు జాబితాలో పేరు ఉందో లేదో తెలుసుకోవాలంటే www.nvsp.in, కానీ, voter helpline app, ceo.telang ana.gov.inలో పరిశీలన చేసుకోవచ్చని తెలిపారు.