సిటీబ్యూరో, జూన్ 13 (నమస్తే తెలంగాణ ) : అత్యంత ప్రమాదకరంగా భవన నిర్మాణ వ్యర్థాలు, రోబో సాండ్ను తరలిస్తున్న వాహనాన్ని ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ (ఈవీడీఎం) గుర్తించి చర్యలు తీసుకున్నారు.
అక్రమంగా, కనీస నిబంధనలు పాటించకుండా తార్నాక వైపున వెళ్తున్న వాహనం యాజమాని సాయి కిరణ్కు రూ.25వేల జరిమానా విధించారు. చలాన్లు వేయడం మా ఉద్దేశం కాదని, నగరాన్ని అందంగా ఉంచడమే లక్ష్యంగా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు పేర్కొంటున్నారు.