హైదరాబాద్ : పాతబస్తీలోని చారిత్రాత్మక మార్కెట్ మీర్ ఆలం మండి ( Mir Alam Mandi ) ని పునరుద్ధరించి, పూర్వ వైభవం తీసుకువస్తామని పట్టణాభివృద్ధి శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ స్పష్టం చేశారు. ఇవాళ హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీతో కలిసి ఆ మార్కెట్ ప్రాంతాన్ని అరవింద్ కుమార్ పరిశీలించారు. ఇటీవల మంత్రి కేటీఆర్తో ఎంపీ ఓవైసీ సమీక్ష సందర్భంగా మీర్ ఆలం మండిని పునరుద్ధరించాలని ప్రతిపాదన వచ్చిందన్నారు. కేటీఆర్ ఆదేశం మేరకు మండిని పునరుద్ధరిస్తున్నామని తెలిపారు.