Naga Chaitanya | హైదరాబాద్లోని ప్రసాద్స్ మల్టీప్లెక్స్లో నిర్వహించిన ‘వృషకర్మ’ చిత్ర వేడుకలో యంగ్ హీరో నాగచైతన్యకు తృటిలో ప్రమాదం తప్పింది. ఈ మూవీ నుంచి నేడు ఫస్ట్ గ్లింప్స్ను విడుదల చేయగా.. ఈ కార్యక్రమం సందడిగా సాగుతున్న సమయంలో, స్టేజీపై చైతన్య కూర్చున్న కుర్చీ ఒక్కసారిగా వెనక్కి పడిపోయింది. దీంతో పక్కనే ఉన్న సెక్యూరిటీ సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించి ఆయన్ని పట్టుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ సంఘటనతో అక్కడ ఉన్న అభిమానులు, చిత్ర యూనిట్ ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. తన గురించి కంగారుపడుతున్న అభిమానులను గమనించిన నాగచైతన్య, ఏమీ కాలేదని చిరునవ్వుతో సైగ చేస్తూ వారిని శాంతింపజేశారు. ఆ వెంటనే ఏమాత్రం తడబడకుండా తన ప్రసంగాన్ని కొనసాగించి అందరినీ ఆశ్చర్యపరిచారు.