ఉప్పల్, మే 3 : ప్రజల సమస్యలను గుర్తించి, వాటి పరిష్కారానికి చర్యలు చేపట్టామని ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. చిలుకానగర్ డివిజన్లోని పబ్లిక్ ఇంటరాక్షన్ కార్యక్రమంలో భాగంగా బుధవారం అన్న పూర్ణకాలనీ, బీరప్పగడ్డ, శ్రీనగర్కాలనీ, మల్లికా ర్జున్ నగర్కాలనీలలో కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్, అధికా రులతో కలిసి ఆయన పర్యటించారు. ఈ మేరకు కాలనీ వాసులతో సమావేశం నిర్వహించి, సమస్యలపై చర్చిం చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కాలనీ వాసు ల నుంచి స్వయంగా సమస్యలు తెలుసుకొని, వాటి పరి ష్కారానికి తగిన ప్రణాళికలు రూపొందిస్తున్నామని పేర్కొ న్నారు. సమస్యలను తక్షణమే గుర్తించి వాటి పరిష్కారా నికి అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పారు. అభివృ ద్ధి, సంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చొరవ తో పనిచేస్తుందన్నారు. నియోజకవర్గంలో అభివృద్ధి పనులు వేగవంతం చేశామన్నారు. ప్రజల అవసరాలను గుర్తించి, సమస్యలు లేకుండా పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలువు రు అధికారులు, నేతలు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు ప్రారంభం..
చిలుకానగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులను కార్పొరేటర్ బన్నాల గీతాప్రవీణ్ ముదిరాజ్తో కలిసి ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి బుధవారం ప్రారంభిం చారు. ఈ మేరకు అన్నపూర్ణకాలనీలో రూ.17 లక్షలతో వరదనీటి కాలువ పనులు, బీరప్పగడ్డ, శ్రీనగర్కాలనీలో రూ.33 లక్షలతో సీసీ రోడ్ల నిర్మాణం, రూ.19.5 లక్షలతో మల్లికార్జుననగర్లో యూజీడీ పనులకు శంకుస్థాపన చేశా రు. అదేవిధంగా చిలుకానగర్కు చెందిన శేఖర్రెడ్డికి సీఎం రిలీఫ్ ఫండ్ నుంచి వచ్చిన రూ.21,500 ల చెక్కును అం దజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కమిషనర్ అరు ణకుమారి, ఈఈ నాగేందర్, డీఈ నిఖిల్రెడ్డి, ఏఈ రాజ్కుమార్, శానిటేషన్ డీఈ చందన, సూపర్వైజర్ సు దర్శన్, జలమండలి మేనేజర్ సంతోష్కుమార్, డీజీఎం రజనీకాంత్రెడ్డి, మేనేజర్ సత్యనారాయణ, ఎలక్ట్రికల్ ఏఈ శ్రీనివాస్, వెటర్నరీ అధికారి జేవియానాయక్, ప లువురు అధికారులు, నేతలు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, లేతాకుల రఘుపతిరెడ్డి, గడ్డం రవికుమార్, డివిజన్ అధ్యక్షుడు పల్లె నర్సింగ్రావు, కొండల్రెడ్డి, పిట్టల నరేశ్, గుడి మధుసూదన్రెడ్డి, రవీందర్రెడ్డి, చేర్యాల శ్రీనివాస్, కొంపల్లి రవీందర్, నరసింహ, బాణాల సత్యనారాయణ, పండ్ల కిషన్, అల్లిబిల్లి మహేందర్, భా స్కర్, సుందర్, పరమేశ్, అశోక్చారి, బాలేందర్, యాదగిరి , తదితరులు పాల్గొన్నారు.