కాప్రా, జూలై 13: ఉప్పల్ నియోజకవర్గ సమగ్రాభివృద్ధియే లక్ష్యంగా పనిచేస్తున్నానని ఎమ్మెల్యే బేతి సుభాష్రెడ్డి అన్నారు. బుధవారం కాప్రా డివిజన్, డాబాగార్డెన్స్లో రూ.20లక్షలతో అభివృద్ధి చేసిన పార్కును స్థానిక కార్పొరేటర్ స్వర్ణరాజుతో కలిసి ఆయన ప్రారంభించారు. అనంతరం వంపుగూడలో రూ.40లక్షలతో చేపట్టే నాలా వెడల్పు పనులకు, రూ.20లక్షలతో చేపట్టే శ్మశానవాటిక పనులకు శంకుస్థాపన చేశారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని అన్ని కాలనీల్లో మౌలిక వసతుల కల్పనతో పాటు ప్రణాళికాబద్దంగా అభివృద్ధిపర్చడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాప్రా సర్కిల్ డిప్యూటీ కమిషనర్ శంకర్, ఈఈ హరిలాల్, ఏఈఈ అభిషేక్, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు, డివిజన్ టీఆర్ఎస్ అధ్యక్షుడు సుడుగు మహేందర్రెడ్డి, గిల్బర్ట్, మహేశ్, కొప్పులకుమార్, బైరి భాస్కర్గౌడ్, భిక్షపతి, శివకుమార్, గణేశ్, రవీందర్రెడ్డి, రాయ్, గిరుకబాయి సురేఖ, తదితరులు పాల్గొన్నారు.