బంజారాహిల్స్ : అనుమానాస్పద స్థితిలో గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బంజారాహిల్స్ పీఎస్ పరిధిలోని కృష్ణానగర్లో గ్రీన్ బావార్చి హోటల్ సమీపంలో ఈనెల 23న సుమారు 50నుంచి 55ఏళ్ల వయసు గల వ్యక్తి అకస్మాత్తుగా కిందపడి తీవ్రగాయాలపాలయ్యాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వగా అతడిని గాంధీ ఆస్పత్రిలో చేర్పించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తుతెలియని వ్యక్తి ఈ నెల 25న మృతి చెందాడు. అతడి ఆచూకీ కోసం ప్రయత్నించగా వివరాలు తెలియలేదు. దీంతో అతడి మృతదేహాన్ని మార్చురీలో భద్రపర్చారు. మృతుడికి సంబందించిన ఆచూకీ తెలిస్తే బంజారాహిల్స్ పోలీసులకు సమాచారం ఇవ్వాలని ఎస్ఐ శరత్ చంద్ర కోరారు.