ఆలయాల్లో ప్రత్యేక పూజలు
పంచాంగ శ్రవణం
మేడ్చల్ జోన్ బృందం : శ్రీ శుభకృత్ నామ సంవత్సరం ఉగాది పండుగను నియోజకర్గ వ్యాప్తంగా ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. మేడ్చల్, ఘట్కేసర్, శామీర్పేట, మూడుచింతలపల్లి, కీసర మండలాలతో పాటు కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని ప్రజలు ఉగాది సందర్భంగా షడ్రుచులతో కూడిన పచ్చడిని తయారు చేసుకున్నారు. ఆలయాలకు వెళ్లి భగవంతుడిని దర్శించుకున్నారు. పలు ఆలయాల్లో పంచాంగ శ్రవణం చేశారు.