హైదరాబాద్ : డబ్బుల్లేక వాహనాల దొంగతనాలకు పాల్పడుతున్న యువకున్ని కాచిగూడ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. కాచిగూడ డీఎస్సై వి.లక్ష్మయ్య తెలిపిన వివరాల ప్రకారం.. గోల్నాక వెంకటేశ్వరనగర్ ప్రాంతానికి చెందిన మధు కుమారుడు బి.ఆకాశ్(19) ఈ నెల 2వ తేదీన రాత్రి వెంకటరమణ తన ఇంటి ముందు ద్విచక్రవాహనాన్ని పార్కింగ్ చేశాడు. తెల్లవారి చూసే సరికి ద్విచక్రవాహనం కనిపించలేదు.
కాచిగూడ పోలీసులకు వెంకటరమణ పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసుకున్న కాచిగూడ పోలీసులు కాచిగూడ రైల్వేస్టేషన్ పరిసర ప్రాంతాల్లో గురువారం అనుమానాస్పదంగా తిరుగుతున్న ఆకాశ్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ద్విచక్రవాహనాన్ని దొంగిలించినట్లు ఒప్పుకున్నాడు. అతడి నుంచి ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకోని రిమాండ్కు తరలించారు.
అన్లాక్ : 7 నుంచి స్కూల్స్, థియేటర్లు ఓపెన్
అదే ఆయన స్పెషల్..ఊరోళ్లతో ముచ్చటంటే సంబుర పడుతడు
Madhuri Dixit song : ఒలింపిక్స్లో మధురీ దీక్షిత్ పాట.. ఎందుకంటే..?
రాష్ట్రంలోని యూనివర్సిటీలకు చేయూతను అందించాలి