వెంగళరావునగర్, అక్టోబర్ 22: మద్యం మత్తులో ఉన్న ఇద్దరు మహిళా కామ పిశాచులు, మరో మహిళకు కూల్ డ్రింక్లో మత్తు మందిచ్చి అఘాయిత్యానికి పాల్పడ్డారు. ఆ తర్వాత బాధితురాలి ఒంటిపై ఉన్న బంగారాన్ని దోచేశారు. ఈ ఘటన మధురానగర్ పోలీస్ష్టేషన్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. బాధితురాలి కథనం ప్రకారం.. రహ్మత్నగర్ డివిజన్కు చెందిన ఓ వివాహిత మహిళ (38) ఈ నెల 13వ తేదీ సాయంత్రం తన భర్తతో గొడవ పడి, ఇంటి నుంచి బయటకు వచ్చింది. యూసుఫ్గూడ బస్స్టాప్ వద్ద రాత్రి నిద్రకు ఉపక్రమించింది. ఆ సమయంలో ఆమె వద్దకు ఇద్దరు మహిళలు వచ్చారు. ఇక్కడ ఎందుకు నిద్రపోతావు.. పక్కనే మా ఇల్లు ఉంది.. వచ్చి పడుకొ.. ఉదయం లేచిపో.. అంటూ అప్యాయంగా పలుకరించారు. వారి మాటలు నమ్మిన బాధితురాలు.. వారితో పాటు ఆటోలో బ్రహ్మశంకర్నగర్లోని ఓ ఇంటికి వెళ్లింది. బాధితురాలికి ఆ ఇద్దరు మహిళలు కూల్డ్రింక్ ఇచ్చారు. కొద్దిసేపటికి బాధిత మహిళ మత్తులోకి వెళ్లిపోయింది.
మత్తులో ఉన్న ఆమెపై ఇద్దరు మహిళలు తమ పైశిచికత్వాన్ని చూపించారు. ఆమెను వివస్త్రను చేసి అఘాయిత్యానికి పాల్పడ్డారు. శరీరమంతా గోళ్లతో రక్కి, గాయపరిచారు. ఆమె మెడలో ఉన్న నాలుగు తులాల బంగారు గొలుసు, చెవిదిద్దులను బలవంతంగా లాక్కొన్నారు. బాధిత మహిళ ప్రతిఘటించే ప్రయత్నం చేసినా.. ఆమెపై దాడి చేశారు. బాధితురాలు అక్కడి నుంచి తప్పించుకొని భర్త వద్దకు వచ్చి.. జరిగిన విషయాన్ని చెప్పింది. గాయపడిన ఆమెను వెంటనే ఆస్పత్రిలో చేర్పించారు.
ఈ ఘటనపై మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆదివారం పోలీస్స్టేషన్ వద్దకు వచ్చిన బాధితురాలు.. మరోసారి పోలీసులకు ఫిర్యాదు చేసింది. వెంటనే స్పందించిన పోలీసులు చర్యలకు ఉపక్రమించారు. అఘాయిత్యానికి పాల్పడిన ఒక మహిళను అదుపులోకి తీసుకున్నారు. కల్లు కంపౌండ్ అడ్డాగా ఇద్దరు మహిళలు కలిసి పలువురు మహిళలతో ప్రకృతి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని పోలీసులు గుర్తించారు. అసహజమైన శృంగారానికి అలవాటు పడటంతో పాటు దోపిడీ, దొంగతనాలకు కూడా ఆ ఇద్దరు మహిళలు పాల్పడుతున్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఆ దిశగానే పోలీసులు దర్యాప్తు చేపట్టారు.