మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా జవహర్ నగర్లో గంజాయి అమ్ముతున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు పట్టుకున్నారు. మల్లికార్జున్ నగర్లో ఎస్వోటీ, జవహర్ నగర్ పోలీసులు సంయుక్తంగా దాడులు జరిపి అక్రమంగా గంజాయిని విక్రయిస్తున్న కౌశిక్ (23), దేవేంద్ర (22)ను పట్టుకున్నారు. నిందితులను జవహర్ నగర్ పోలీస్ స్టేషన్కు తరలించారు.
నిందితుల నుంచి 1.05 గ్రాముల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.