హైదరాబాద్ : హైదరాబాద్ కోఠీలో(Koti) ఏటీఎం వద్ద వ్యాపారిపై కాల్పులు జరిపి నగదుతో పారిపోయిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. ఉత్తర్ ప్రదేశ్లో ఇద్దరు నిందితులను టాస్క్ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకొని హైదరాబాద్కు తీసుకొస్తున్నట్లు సమాచారం. వివరాల్లోకి వెళ్తే..హైదరాబాద్లోని కోఠి బ్యాంక్ స్ట్రీట్లో జనవరి 31 ఎస్బీఐ ప్రధాన కార్యాలయం వద్ద ఏటీఎంలో(ATM) డబ్బులు డిపాజిట్ చేసేందుకు వచ్చిన ఓ వ్యక్తిపై కాల్పులు జరిపి.. రూ.6లక్షల వరకు ఎత్తుకెళ్లారు. ఉదయం 7 గంటలకు రషీద్ అనే వ్యక్తి బ్యాంక్ ఏటీఎంలో రూ.6లక్షల నగదు డిపాజిట్ చేసేందుకు బ్యాంక్ స్ట్రీట్కు వచ్చాడు.
రషీద్ డబ్బులతో రావడం గమనించిన కొందరు దుండగులు అతడిని వెంబడించారు. అది గమనించి రషీద్ పారిపోతుండటంతో అతనిపై కాల్పులు జరిపి డబ్బులు ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో రషీద్ కాలికి గాయమైంది. దీనిపై సమాచారం అందుకున్న సుల్తాన్ బజార్ పోలీసులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రషీద్ను హాస్పిటల్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఘటనాస్థలిలోని సీసీ కెమెరాల ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేపట్టారు.