హైదరాబాద్, అక్టోబర్ 11 (నమస్తే తెలంగాణ): బాలికల సంరక్షణకు కట్టుబడి ఉందామని టీఎస్ ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ పిలుపునిచ్చారు. మంగళవారం అంతర్జాతీయ బాలిక దినోత్సవాన్ని పురస్కరించుకొని ఈ మేరకు ప్రతిజ్ఞ చేయాలని ట్విట్టర్లో విజ్ఞప్తి చేశారు. బాలికలకు ప్రాధాన్యం ఇవ్వాలని, వారు సంతోషంగా జీవించేలా అంతా కలిసి కృషి చేద్దామని పేర్కొన్నారు.