త్రిసూర్: ఇండియాలో కరోనా సోకిన తొలి పేషెంట్ మళ్లీ ఆ వైరస్ బారిన పడింది. చైనాలోని మెడికల్ కాలేజ్లో చదువుతున్న కేరళలోని త్రిసూర్కు చెందిన విద్యార్థిని దేశంలో తొలి కరోనా పేషెంట్గా నిలిచిన విషయం తెలిసిందే. ఆమెకు తాజాగా మరోసారి పాజిటివ్గా తేలినట్లు ఆరోగ్య అధికారి వెల్లడించారు. అయితే ఆమెకు లక్షణాలేమీ లేవని చెప్పారు. ఢిల్లీకి వెళ్దామనుకున్న ఆమె మరోసారి టెస్ట్ చేయించుకోగా పాజిటివ్గా తేలింది. ఆమె ప్రస్తుతం హోమ్ క్వారంటైన్లో ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆమె ఇప్పటికే కరోనా వ్యాక్సిన్ తొలి డోసు తీసుకున్నట్లు చెప్పారు.
2020 జనవరిలో ఆమెకు కరోనా సోకింది. దీంతో నెల రోజుల పాటు హాస్పిటల్లో ఉండి చికిత్స తీసుకుంది. ఆ తర్వాత ఆమెతోపాటు వుహాన్కు వెళ్లిన మరో ఇద్దరు స్నేహితురాళ్లకు కూడా పాజిటివ్గా తేలింది. గతేడాది జనవరి 27నుంచి ఫిబ్రివరి 20 వరకు ఆమె 24 రోజుల పాటు ఐసోలేషన్లో ఉంది.