హైదరాబాద్ : కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏవోసీ రోడ్ల మూసివేత జరగలేదని చేసిన కామెంట్కు నిరసనగా మూసివేసిన రోడ్ల ముందు రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ క్రిశాంక్ ఆధ్వర్యంలో టీఆర్ఎస్ నేతలు నిరసన తెలిపారు. కంటోన్మెంట్లోని తిరుమలగిరి వద్ద గల గోల్డెన్ పల్మ్ ఎన్క్లేవ్ గేటు ముందు గేటు ముందు బైఠాయించారు.
ఈ సందర్భంగా క్రిశాంక్ మాట్లాడుతూ..కంటోన్మెంట్ సీఈవో కేంద్ర ప్రభుత్వానికి తొత్తులుగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వెంటనే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అబద్ధాలు మానుకోవాలని డిమాండ్ చేశారు.