హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకల్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేసిన టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై టీఆర్ఎస్ పార్టీ నాయకులు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కేసీఆర్ను విమర్శిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు.
హైదరాబాద్ నగర వ్యాప్తంగా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ, నిరసన ప్రదర్శనలు చేపట్టారు. ముషీరాబాద్లో టీఆర్ఎస్ నాయకులు.. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను గాడిదపై ఊరేగించి దహనం చేశారు. బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి వద్ద ఎమ్మెల్యే దానం నాగేందర్ ఆధ్వర్యంలో రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దహనం చేశారు.