సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): గిరిజనులను మోసం చేసిన బీజేపీకి ఓట్లేయమని, గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామని ఇచ్చిన హామీ ఏమైందంటూ ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ చైర్మన్ ఆర్.రవీంద్రనాయక్ ప్రధాని మోదీకి ప్రశ్నలు సంధించారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బీజేపీ నేతలకు చీము, నెత్తురు ఉంటే.. ఎస్టీలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకునేందుకు శీతాకాల పార్లమెంట్ సమావేశాల్లో ట్రైబల్ యూనివర్సిటీ ఏర్పాటుకు చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఆల్ తెలంగాణ ట్రైబల్ స్టూడెంట్స్ జేఏసీ నాయకులు ధరావత్ సురేశ్నాయక్, ప్రవీణ్నాయక్, గుగులోత్ తిరుపతినాయక్, వినోద్రాథోడ్, మహేందర్పాల్గొన్నారు.
బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే తెలంగాణ నుంచి తరిమికొడతం
ఓయూ జేఏసీ అధ్యక్షుడు ఎల్చాల దత్తాత్రేయ
సిటీబ్యూరో, డిసెంబర్ 4 (నమస్తే తెలంగాణ): బీసీల రిజర్వేషన్లు పెంచకుంటే తెలంగాణ నుంచి బీజేపీని తరిమికొడతామని ఓయూ జేఏసీ అధ్యక్షుడు డాక్టర్ ఎల్చాల దత్తాత్రేయ అన్నారు. ఆదివారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో మీడియా ప్రతినిధుల సమావేశంలో భాగంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. కేంద్ర దర్యాప్తు సంస్థలను కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం దుర్వినియోగం చేస్తున్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను కేవలం ఓటు వేసే యంత్రాలుగా చూడకుండా వారి స్థితిగతులను మార్చే రిజర్వేషన్లు తక్షణం పెంచాలని నేతలు డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఓయూ జేఏసీ నాయకుడు అశోక్ యాదవ్, విద్యార్థి సంఘాల నాయకులు రవీందర్నాయక్, అనిల్ ప్రజాపతి, శ్రావణ్, రవితేజ, సత్యపాల్, వంశీకృష్ణ, నవీన్, శోభన్, తిరుపతి, పాల్గొన్నారు.
తప్పుడు ఆరోపణలు సహించం
చాదర్ఘాట్, డిసెంబర్ 4: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేస్తే సహించేది లేదని టీఎస్ఆర్టీసీ లైసెన్డ్స్ పోర్టర్స్ యూనియన్ అధ్యక్షుడు కారింగల మారుతి అన్నారు. కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును నిరసిస్తూ ఆదివారం పోర్టర్స్ యూనియన్ నాయకులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీబీఐ, ఈడీతో తప్పుడు కేసులు బనాయించి దాడులకు పాల్పడుతున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఇలాగే చేస్తే కార్మికులు, మహిళలు ఏకమై రాష్ట్రంలో బీజేపీ ప్రజాప్రతినిధులను తిరుగకుండా అడ్డుకుంటామని హెచ్చరించారు.