Traffic Restrictions | హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా నిర్మించిన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ సచివాలయాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదివారం ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివారం తెల్లవారుజామున 4 నుంచి రాత్రి 8 గంటల వరకు సచివాలయం పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. దీంతో సచివాలయం వైపు వచ్చే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలను ఎంచుకోవాలని డీజీపీ అంజనీ కుమార్ సూచించారు.
-వీవీ విగ్రహం – నెక్లెస్ రోటరీ – ఎన్టీఆర్ మార్గ్ మధ్య వాహనాలకు అనుమతి లేదు. తెలుగు తల్లి జంక్షన్ను మూసివేయనున్నారు.
ఖైరతాబాద్, పంజాగుట్ట, సోమాజిగూడ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను వీవీ విగ్రహం వద్ద షాదాన్, నిరంకారి భవనం వైపు మళ్లిస్తారు.
-నిరంకారి, చింతల్ బస్తీ నుంచి నెక్లెస్ రోటరీ వైపు వచ్చే వాహనాలను అనుమతి లేదు. ఖైరతాబాద్ ఫ్లై ఓవర్ను మూసివేయనున్నారు.
-ఇక్బాల్ మినార్ జంక్షన్ నుంచి ట్యాంక్ బండ్, రాణిగంజ్ వైపు వెళ్లే వాహనదారులు తెలుగు తల్లి ఫ్లై ఓవర్ మీదుగా లోయర్ ట్యాంక్ బండ్ చేరుకోవాల్సి ఉంటుంది.
-ట్యాంక్ బండ్, తెలుగు తల్లి జంక్షన్ వైపు వచ్చే ట్రాఫిక్ను ఎన్టీఆర్ మార్గ్ వైపు అనుమతించరు. ఇక్బాల్ మినార్ వైపు మళ్లిస్తారు.
-బీఆర్కే భవన్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను తెలుగు తల్లి జంక్షన్ మీదుగా ఇక్బాల్ మినార్ వైపు మళ్లించనున్నారు.
-బడా గణేశ్ లేన్ నుంచి ఐమాక్స్, నెక్లెస్ రోటరి నుంచి వైపు వచ్చే వాహనాలకు అనుమతి లేదు. ఈ వాహనాలను బడా గణేశ్ లేన్ నుంచి రాజ్ధూత్ లేన్ వైపునకు మళ్లించనున్నారు.
-ఎన్టీఆర్ గార్డెన్, ఎన్టీఆర్ ఘాట్, నెక్లెస్ రోడ్, లుంబనీ పార్కు మూసివేయనున్నారు.
-అఫ్జల్ గంజ్ నుంచి ట్యాంక్బండ్ మీదుగా సికింద్రాబాద్ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సులు.. రవీంద్ర భారతి, తెలుగు తల్లి ఫ్లై ఓవర్, కట్ట మైసమ్మ టెంపుల్, లోయర్ ట్యాంక్ బండ్, డీబీఆర్ మిల్స్, కవాడిగూడ మీదుగా సికింద్రాబాద్ చేరుకోవాలి.
-వీవీ విగ్రహం జంక్షన్, ఓల్డ్ సైఫాబాద్ పీఎస్ జంక్షన్, రవీంద్ర భారతి జంక్షన్, మింట్ కంపౌండ్ రోడ్డు, తెలుగు తల్లి జంక్షన్, నెక్లెస్ రోటరీ, నల్లగుట్ట జంక్షన్, కట్ట మైసమ్మ టెంపుల్, ట్యాంక్ బండ్, లిబర్టీ జంక్షన్ల వైపు వాహనాలకు అనుమతించరు.