హైదరాబాద్ : ఈ నెల 12వ తేదీన హైదరాబాద్లో ట్రాఫిక్ ఆంక్షలు విధించినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన నేపథ్యంలో బేగంపేట ఎయిర్పోర్టు పరిసరాల్లో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయన్నారు. పంజాగుట్ట – గ్రీన్ ల్యాండ్స్ – ప్రకాశ్ నగర్ టీ జంక్షన్, రసూల్పురా టీ జంక్షన్, సీటీవో మార్గాల్లో వాహనాల మళ్లింపు ఉంటుందని, ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని సూచించారు.
సోమాజిగూడ, మోనప్ప ఐలాండ్, రాజ్భవన్ రోడ్, ఖైరతాబాద్ జంక్షన్ పరిధిలో మధ్యాహ్నం 12 నుంచి రాత్రి 7 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మార్గాల్లో ప్రయాణించే వాహనదారులు, ప్రయాణికులు ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని ట్రాఫిక్ పోలీసులు సూచించారు.