హైదరాబాద్ : ఈ నెల 27న హెచ్ఐసీసీలో నిర్వహించే టీఆర్ఎస్ ప్లీనరీ సందర్భంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు పలు ఆంక్షలు విధించారు. వాహనదారులకు ఇబ్బందులు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు పలు చర్యలు చేపడుతున్నారు. హెచ్ఐసీసీ పరిసర ప్రాంతాలైన కొత్తగూడ-హైటెక్స్, సైబర్ టవర్స్-ఐకియా రోటరీ, గచ్చిబౌలి జంక్షన్ టూ కొత్తగూడ ప్రాంతాల్లోని కార్యాలయాల నిర్వాహకులు వారి సమయ వేళలను మార్చుకోవాలని అధికారులు సూచించారు. ఉదయం 9 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 7 గంటల వరకు ట్రాఫిక్ రద్దీ ఉండే అవకాశం ఉంటుందని, ఈ సమయాల్లో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకోవాలని పోలీసులు సూచించారు.
-నీరూస్ జంక్షన్-సైబర్ టవర్స్ జంక్షన్-మెటల్ చార్మినార్ జంక్షన్-గూగుల్(సీఐఐ) జంక్షన్-కొత్తగూడ జంక్షన్ రోడ్డు.
-మెటల్ చార్మినార్ జంక్షన్-ఖానామెట్ జంక్షన్-హైటెక్స్/హెఐసీసీ/ఎన్ఏసీ రోడ్డు.
-జేఎన్టీయూ-సైబర్ టవర్స్ -బయోడైవర్సిటీ జంక్షన్.
-గచ్చిబౌలి జంక్షన్-బొటానికల్ గార్డెన్ జంక్షన్- కొత్తగూడ జంక్షన్-కొండాపూర్ జంక్షన్లు.
-నీరూస్ నుంచి గచ్చిబౌలి జంక్షన్కు వెళ్లే వారు సీఓడీ(మాదాపూర్ అయ్యప్ప సొసైటీ) నుంచి దుర్గం చెరువు-ఇనార్బిట్-ఐటీసీ కోహినూర్-ఐకియా-బయోడైవర్సిటీ-గచ్చిబౌలి మీదుగా సైబర్ టవర్స్ వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి.
-మియాపూర్, కొత్తగూడ, హఫీజ్పేట్ ప్రాంతాలనుంచి వచ్చే వారు హైటెక్ సిటీ- సైబర్ టవర్స్-జూబ్లీహిల్స్ వచ్చే వాహనాలు రోల్లింగ్ హిల్స్ ఏఐజీ హాస్పిటల్-ఐకియా-ఇనార్బిట్-దుర్గం చెరువు రోడ్డులో ప్రయాణించాలి.
-ఆర్సీపురం, చందానగర్, మాదాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల నుంచి వచ్చే వాహనదారులు బీహెచ్ఈఎల్-నల్లగండ్ల-హెచ్సీయూ-ట్రిపుల్ ఐటీ-గచ్చిబౌలి రోడ్డులో కొండాపూర్, ఆల్విన్ రోడ్డు వైపునకు వెళ్లకుండా రాకపోకలు సాగించాలి.