హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర సమితి సర్వసభ్య సమావేశం తెలంగాణ భవన్లో జరుగునున్నది. ఈ నేపథ్యంలో బంజారాహిల్స్లోని పలు ప్రాంతాల్లో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సమావేశానికి సీఎం కేసీఆర్, రాష్ట్రవ్యాప్త నలుమూలల నుంచి ప్రతినిధులతో పాటు పలు రాష్ట్రాల నుంచి నేతలు హాజరుకానున్నారు. ఈ సందర్భంగా ఈ సందర్భంగా ఎలాంటి ఇబ్బందుల్లేకుండా చర్యలు చేపట్టినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు.
ఈ ట్రాఫిక్ ఆంక్షలు ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలు ఉంటాయని ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. బంజారాహిల్స్ రోడ్డు నంబర్-12 మీదుగా వాహనదారుల రాకపోకలు నిలిపివేయగా.. ప్రత్యామ్నాయ మార్గాల్లో వెళ్లాలని నేతలు సూచించారు. ఎన్టీఆర్ భవన్, అపోలో హాస్పిటల్, ఫిలింనగర్ నుంచి వచ్చే వాహనాలను జూబ్లీహిల్స్ రోడ్ నంబర్ 45, 36 మీదుగా మళ్లించనున్నారు. మాసబ్ట్యాంక్ వైపు నుంచి రోడ్ నంబర్-12 వైపు వచ్చే వాహనాలను రోడ్ నంబ్-1, 10 మీదుగా జహీర్నగర్ నుంచి ఎన్టీఆర్ భవన్ మీదుగా మళ్లించనున్నారు.