హైదరాబాద్ : గణేష్ నవరాత్రులలో భాగంగా మూడో రోజు నుంచి నిమజ్జనాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ట్యాంక్బండ్ పరిసర ప్రాంతాల్లో ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు మధ్యాహ్నం 3 గంటల నుంచి ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని నగర ట్రాఫిక్ జాయింట్ సీపీ రంగనాథ్ తెలిపారు. గణేష్ నిమజ్జనాలను బట్టి ఈ ప్రాంతంలో మరిన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించే అవకాశం ఉందని రంగనాథ్ పేర్కొన్నారు.