సిటీబ్యూరో, డిసెంబర్ 19 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం నగర పర్యటన సందర్భంగా ట్రాఫిక్ ఆంక్షలు విధిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉదయం 9:30 నుంచి 10:15 గంటలకు హకీంపేట్ ఎయిర్పోర్టుకు వెళ్లనుండడంతో లోత్కుంట టీ జంక్షన్, బైసన్ గేట్, హెలీప్యాడ్ వై జంక్షన్, యాప్రాల్ రోడ్డు, నవ్య జంక్షన్, బొల్లారం చెక్పోస్టు, హకీంపేట్ ఎయిర్పోర్స్ స్టేషన్ వై జంక్షన్ రూట్లను మూసివేస్తారు.
అదే విధంగా మధ్యాహ్నం 1 నుంచి 1:40 గంటల మధ్యలో తిరుగు ప్రయాణంలోను మూసివేస్తారని ట్రాఫిక్ డీసీపీ సుబ్బారాయుడు తెలిపారు. సాయంత్రం 6 నుంచి 7 గంటలకు సికింద్రాబాద్ పారేడ్ గ్రౌండ్స్కు వెళ్తుండటంతో ఆ సమయంలో లోతుకుంట టీ జంక్షన్, ఎంసీఈఎంఈ సిగ్నల్, లాల్ బజార్ టీ జంక్షన్, తిరుమలగిరి ఎక్స్ రోడ్స్, సికింద్రాబాద్ క్లబ్ గేట్, ఎన్సీసీ ఎక్స్ రోడ్స్, తివోలి ఎక్స్ రోడ్స్, ఫ్లాజా ఎక్స్ రోడ్స్, ఫ్లాజా, సీటీఓ, అదే విధంగా రాత్రి 7:45 నుంచి 8:45 గంటలకు తిరుగు ప్రయాణంలో ఈ రూట్లోని జంక్షన్లను మూసివేస్తున్నట్లు వెల్లడించారు.